మణిపుర్ అంశంపై లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండోరోజు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. దేశాన్ని మణిపుర్లో హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు.. దేశ ద్రోహులన్న ఆయన...వాళ్లు భరతమాత రక్షకులు కాదని హంతకులంటూ మండిపడ్డారు.