తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ వేదికగా నిలిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో ఆత్మీయుల మధ్య రాఖీపౌర్ణమి వేడుకలు జరిగాయి. రక్షాబంధన్ సందర్భంగా కేసీఆర్కు అక్కచెల్లెలు రాఖీ కట్టారు. ఆ తర్వాత సోదరీమణులకు కేసీఆర్ పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకలో కేసీఆర్ సతీమణి శోభతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.