మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో పలువురు రియల్టర్లు రెచ్చిపోయారు. రియల్ ఎస్టేట్ కోసం ఏకంగా శ్మశానవాటికనే ధ్వంసం చేశారు. అందుకు అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. 10లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని కూల్చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేశారు.