శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు సీఐఎస్ఎఫ్ అధికారులు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ప్రజలు భారీ సంఖ్యలో రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ప్రయాణీకుల్ని సైతం అలర్ట్ చేశారు. ఎయిర్పోర్టుకు.. బంధువుల్ని తీసుకురావద్దని సూచించారు.