విశాఖకు వచ్చారు బెంగాల్ పోలీసులు. విద్యార్థిని రీతిషాహా అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేపట్టారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ మృతురాలి తండ్రి పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ సీఎం ఆదేశాలతో కోల్కతాలోని నేతాజీ నగర్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విశాఖ వచ్చి విచారణ చేపట్టారు బెంగాల్ పోలీసులు. హత్య కోణంలో విచారణ మొదలుపెట్టారు. రీతిషాహాది ఆత్మహత్యగా భావిస్తున్నారు విశాఖ పోలీసులు. విచారణలో కళాశాల, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.