మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. బీరువా, హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.