దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కంపెనీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. హాన్ జోంగ్-హీ శామ్సంగ్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాల విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆ కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీలో కీలకమైన భాగమైన చిప్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ సెమీకండక్టర్ (చిప్) వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. హాన్ 2022లో శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ మరియు CEOగా నియమితులయ్యారు. ఆయన కంపెనీ బోర్డు సభ్యుడు కూడా.స్మార్ట్ఫోన్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో చైనా కంపెనీల నుండి శామ్సంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో హాన్ మరణం సంభవించింది. ఇటీవలి కాలంలో, స్మార్ట్ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ తన మొదటి స్థానాన్ని ఆపిల్కు కోల్పోయింది.