Brahmos Aerospace: ‘బ్రహ్మోస్‌’ సీఈఓగా జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి

Update: 2024-11-27 01:00 GMT

 బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ కొత్త సీఈఓగా ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్‌ జైతీర్థ్‌ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ, ఎండీ అతుల్‌ దిన్‌కర్‌ రాణే పదవీకాలం ముగియడంతో ఈ స్థానంలో జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన డిసెంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్డీవో), రష్యాకు చెందిన మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ను ఏర్పాటు చేశాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ సంస్థ బ్రహ్మోస్‌ క్షిపణులను తయారుచేస్తున్నది.

Tags:    

Similar News