ఏపీ సీఎం జగన్ దిగజారి మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరుకుతున్నారని, జగన్కు ముందే తెలుసన్నారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలే అని షర్మిల స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబను, పవన్ను తిట్టడానికే వెంకటరిగిలో జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేసారని ఆరోపించారు. సభలో పిల్లలు, మహిళలు, పెద్దలున్నారని జగన్ మరిచిపోయి మాట్లాడరన్నారు. నాటి గాంధీ నుండి నేటి మోదీ వరకూ జనాల్లో తిరుగుతున్నారని, జగన్ ప్రాణ భయంతో తిరుగుతున్నారని విమర్శించారు.