ఇవాళ రాష్ట్ర గవర్నర్ నజీర్తో టీడీపీ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. నిన్న పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న వైసీపీ నేతలు చేసిన దాడులకు సంబంధించి వీడియోలను గవర్నర్కు అందజేయనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల ఫోటోలను కూడా గవర్నర్కు సమర్పిచనున్నారు.