మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. విశాఖలో ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. జోగి రమేష్ బీసీల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.