తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. కిషన్రెడ్డి, ఈటల మధ్యలో గ్యాప్ రావడంతో మాజీ మంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగింది. ఈటల ద్వారా బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తనను సంప్రదించకపోవడంతో చేరికను వాయిదా వేశారు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మరోవైపు బీజేపీలో చేరక ముందే అంబర్ పేట్ నుంచి పోటీ చేస్తానన్న కృష్ణాయాదవ్ ప్రకటించేశారు. దీంతో కిషన్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.