కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత కత్తిమీద సాములా మారింది. 119 నియోజకవర్గాలకు గాను వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేయడంతో.. పీఈసీ పని కష్టతరంగా మారింది. దీంతో నిన్న పీఈసీ సమావేశం అసంతృప్తిగా ముగిసింది. అభ్యర్థుల వడపోతకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 2న మరోసారి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజే దరఖాస్తుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. సెప్టెంబర్ 2 లేదా 3వ వారంలో తుది జాబితా విడుదలకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.