బీసీ మంత్రం జపిస్తుంది టీకాంగ్రెస్. పార్టీలో బీసీల ప్రాధాన్యతపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుంది టీ కాంగ్రెస్. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ డిక్లరేషన్లో చేర్చాల్సిన అంశాలపై సూచనలు,సలహాలు ఇవ్వనుంది పొన్నం కమిటీ. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రధాన్యతపై సిఫార్సులు చేయనుంది. కమిటీలో పార్టీలోని బీసీ నేతలకు చోటు కల్పించారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.