తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. రికార్డ్ స్థాయిలో గాంధీ భవన్కు దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు 723 మంది టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టారు. అటు.. ఇవాళ్టితో కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా దరఖాస్తులు రానున్నాయి. ఒక్క ఇల్లెందు నియోజకవర్గం టికెట్ కోసమే 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల.. తదితర కాంగ్రెస్ అగ్రనేతలు అప్లై చేసుకున్నారు. ఇవాళ భట్టి, ఉత్తమ్, పద్మావతి తదితర నేతలు దరఖాస్తు చేయనున్నారు. రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలించనున్నారు.