ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గవర్నర్ కోరిన అంశాలపై క్లారిటీ ఇచ్చింది. కార్పొరేషన్ కన్నా మెరుగైన జీతాలు ఉంటాయన్న ప్రభుత్వం.. విలీనం తర్వాత రూపొందించే గైడ్లైన్స్లో.. అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. ఏపీ తరహాలోనే విలీన ప్రక్రియ ఉంటుదని స్పష్టం చేసింది.