గంగవరం పోర్టు రణరంగాన్ని తలపించింది. సమస్యల పరిష్కారంపై కార్మికులు పోర్టును ముట్టడించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా నిర్వాసితులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు చేస్తున్నా.. పోర్టు యాజమాన్యం స్పందించకపోవడంతో పోరుబాట పట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను చేధించుకుని కార్మికులు.. ఒక్కసారిగా ముందుకు రావడంతో ఆ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తింది. ఇనుప కంచెలను దాటి పోర్ట్ గేట్ను ముట్టడించారు. తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు పోలీసులకు, కార్మికులకు గాయాలయ్యాయి.