జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. పల్లా వద్దు..ముత్తిరెడ్డే ముద్దు అంటు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.ముత్తిరెడ్డి అనుచరులు భారీగా జనగామకు చేరుకుంటున్నారు.బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వద్దని..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి ఇవ్వాలని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు.