గాంధీభవన్లో అభ్యర్థుల దరఖాస్తు ప్రతులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈనెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 25వేలు.. సాధారణ అభ్యర్ధులకు 50వేలుగా దరఖాస్తు రుసుము ఉంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల కార్యక్రమం మొదలు పెట్టామన్న రేవంత్రెడ్డి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించాకే అభ్యర్థుల ఖరారు ఉంటుందన్నారు. అప్పటి వరకు తామే అభ్యర్ధులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయన్నారు.