మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ నేతల సమావేశం

Update: 2023-08-20 08:16 GMT

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ విడుదల చేయనుంది. ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు.ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు టీ కాంగ్‌ నేతలు . ఇక మహిళా డిక్లరేషన్ విడుదలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు. 

Tags:    

Similar News