టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభ ఆమోదించింది. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ బిల్లుకు ఎంఐఎం, బీజేపీ శాసనసభ్యులు మద్దతు తెలిపారు.