శ్రీవారి భక్తుల భద్రత విషయంలో టీటీడీ చర్యలు తీసుకుంది. చిన్నారులపై చిరుత పులుల దాడిల తర్వాత అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలర్టైంది. కాలిబాట మార్గంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఊతకర్రలను అందజేశారు. 250 మెట్లకు ఒక సెక్యూరిటీ సిబ్బంది ఉండగా ప్రతి ఒక్కరికి ఊతకర్రలను టిటిడి అందజేసింది. మొత్తం 70మంది సెక్యూరిటీ సిబ్బందికి ఊతకర్రలను అందజేశారు. అలాగే ఊతకర్రలతోనే భక్తులతో పాటు నడుచుకుంటూ వెళుతున్నారు సెక్యూరిటీ గార్డులు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలంటూ సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.