నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా పసుపు ధర 10 వేల మార్క్కు చేరుకుంది. గడిచిన 15 రోజుల్లోనే క్వింటా పసుపు ధర రెండున్నర వేలు పెరిగింది. దీంతో ముందే పంటను అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసుపు పంటకు ఒక్కసారిగా ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.