హైదరాబాద్ ఉప్పల్లోని స్కై వాక్ను రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 25 కోట్ల వ్యయంతో HMDA దీన్ని నిర్మించింది. 36 పిల్లర్లు ఉండగా.. 660 మీటర్ల పొడవుతో నిర్మాణం జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు చుట్టూ.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా స్కై వాక్ నిర్మించారు. 6 చోట్ల స్కై వాక్ ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఎస్కలేటర్స్, మెట్లు, లిఫ్టులు ఉన్నాయి. నేరుగా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లే వీలుంది. ఈ స్కై వాక్ వందేళ్ల పాటు సేవలు అందించనుంది.