నారా లోకేష్తో వంగవీటి రాధ ప్రత్యేక సమావేశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర విరామ సమయంలో లోకేష్ను కలిశారు వంగవీటి రాధ.. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఇటీవల యువగళం పాదయాత్రలో వరుసగా పాల్గొన్నారు వంగవీటి రాధ.. అయితే లోకేష్, వంగవీటి రాధా భేటీపై రాజకీయాల్లో చర్చ మొదలైంది.