జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం వెండిపూలతో విజయమాల తయారు చేయించాడు అమలాపురానికి చెందిన దొరబాబు అనే వీరాభిమాని. 511 వెండిపూలతో విజయమాల తయారు చేయించిన దొరబాబు స్థానిక పొలేరమ్మ ఆమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. పవన్కు అమ్మవారి అనుగ్రహం కలగాలని మొక్కుకున్నారు. ఈ నెల 22న అమలాపురంలో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో పవన్ మెడలో వెండి విజయమాల వేయనున్నారు దొరబాబు.