విజయనగరంలో గ్రీన్ అంబాసిడర్లు ఆందోళనకు దిగారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.అయితే తాము నిరసన చేస్తున్నా అధికారులు పట్టించుకు పోవడంతో కలెక్టరేట్ లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు.గ్రీన్ అంబాసిడర్లను అడ్డుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు,గ్రీన్ అంబాసిడర్లుకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.నెలలు తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయని,తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులు నుండి వైదొలుగుతామని హెచ్చరించారు. జీతం అందక గత నెలలో బొబ్బిలికి చెందిన గ్రీన్ అంబాసిడర్ ఆత్మహత్య చేసుకున్నాడు.