పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు... రాష్ట్ర పోలీసులను మోహరించినప్పటికీ హింస చెలరేగింది. ఉదయం నుంచే పోలింగ్ బూత్లపై దాడులు జరిగాయి. టీఎంసీ, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో 11 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఉన్నారు.