విపక్షాలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. కావాలనే సమస్యలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ పెనుమార్పులు తీసుకురాబోతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో రెండో రోజు పలెనిద్ర కార్యక్రమలో పాల్గొన్నారు.