సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. ఒడిసిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో వైసీపీ నేతల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆర్థిక నేరాలపై.. పల్లె రఘునాథ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రా నీరవ్ మోడీ శ్రీధర్రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అక్రమాస్తులు 15వందల కోట్లకు పైగానే ఉంటాయని ఆరోపించారు. శ్రీధర్రెడ్డితో పాటు జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని పల్లె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పల్లె రఘునాథ్రెడ్డిపై వైసీపీ నాయకులు దాడికి యత్నించారు.