దేశ వ్యాప్తంగా టమాట ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ధరలు రికార్డు స్ధాయికి చేరుతున్న క్రమంలో టమాట రైతులపై దాడులు, మార్కెట్లలో చోరీ కేసులు కూడా అధికమయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నక్కబండాలో టమాట రైతుపై యువకులు దాడికి పాల్పడ్డారు. పలమనేరు మార్కెట్లో టమాలు అన్ లోడ్ చేసి వస్తున్న లోకరాజ్ అనే రైతుపై బీర్ బాటిల్స్తో దాడిచేశారు. టమాలు అమ్మగా వచ్చిన 4లక్షల 50 వేలు దుండగులు ఎత్తుకెళ్లారు. గాయపడ్డ రైతును పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.