Kurnool Mayor: జై జగన్‌ అంటేనే నిధులిస్తామమన్న మేయర్ బీవై రామయ్య

Update: 2023-08-31 07:34 GMT


నగరాభివృద్ధికి పాటుపడాల్సిన కర్నూలు మేయర్‌ వైసీపీ అనుచరుడిలా మారారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలని టీడీపీ కార్పొరేటర్లు విన్నవించగా జై జగన్‌ అంటేనే నిధులిస్తామన్నారు మేయర్‌ బి.వై.రామయ్య. కర్నూలులోని నూతన కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం నగరపాలక పాలకవర్గ సమావేశం జరిగింది. టీడీపీ చెందిన పలువురు కార్పొరేటర్లు తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలంటూ సభ దృష్టికి తెచ్చారు. వీధి దీపాల పనులు చేయమంటే టీడీపీ గెలిచిన వార్డుల్లో చేయోద్దని అధికారులే చెబుతున్నారన్నారు.

Tags:    

Similar News