ASIA CUP: ఆసియా కప్ సమరానికి భారత్ సిద్ధం
ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా... సన్నహాలు ప్రారంభించిన సూర్య సేన... యూఏఈతో సెప్టెంబర్ 10న భారత్ మ్యాచ్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది. ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. లీగ్ దశలో ప్రతీ జట్టు ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. నాలుగు జట్లు మరోసారి ఒక్కోసారి తలపడుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన ఆయా దేశాలు సన్నాహకాలు కూడా ప్రారంభించాయి. యూఏఈ, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లు సన్నాహకంగా ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతిలో ఉన్న భారత జట్టు మాత్రం ఇంకా సన్నాహకాలు మొదలుపెట్టలేదు.
చేరుకున్న టీమిండియా
ఇప్పటికే టీమ్ఇండియా ప్లేయర్లు దుబాయ్లో అడుగుపెట్టేశారు. ఈసారి పొట్టి ఫార్మాట్ మ్యాచులు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజుల్లో టీమిండియా యూఏఈకి చేరనుంది. తొలి మ్యాచ్ను యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనున్న భారత్.. సెప్టెంబర్ 14న దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, భారత్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడు సార్లు తలపడుతాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ వర్సెస్ యూఏఈ మధ్య రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
తొలి మ్యాచ్కు రంగం సిద్ధం
భారత జట్టు సెప్టెంబర్ 9 నుంచి యూఏఈతో ప్రారంభమయ్యే టీ20 ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో పాల్గొంటుంది. టీమిండియా ఆటగాళ్లందరూ సెప్టెంబర్ 4 నాటికి దుబాయ్ చేరుకోవాలని బీసీసీఐ నుంచి ఆదేశాలు అందాయి. జట్టు తొలి శిక్షణా సెషన్ ఈరోజు, సెప్టెంబర్ 5 నుంచి ఐసీసీ అకాడమీలో జరుగుతుంది. ఆసియా కప్ 2025లో భారత జట్టు పూల్ ఏలో ఉంది. ఇందులో యూఏఈ, ఒమన్, పాకిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 10 న జరిగే యూఏఈ జట్టుతో భారత జట్టు టోర్నమెంట్లో తన మొదటి మ్యాచ్ ఆడాలి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్న ఆసియా కప్ భారతదేశానికి చాలా ముఖ్యమైనది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రాధాన్యత పెరిగింది. భారత జట్టు సెప్టెంబర్ 10న దుబాయ్ స్టేడియంలో UAEతో ఆడటం ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ వేదికపై భారత జట్టు రికార్డు దాదాపు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు సమానం, ఇప్పటివరకు ఇక్కడ 9 మ్యాచ్లు ఆడింది. వీటిలో టీం ఇండియా 5 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే ఈ టోర్నీలో గెలిచే జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్మనీని లభించనుంది. రన్నరప్ జట్టుకు రూ. 1.3 కోట్లు దక్కనుంది. 2022లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరగ్గా.. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీలంకకు రూ. 1.6 కోట్లు ప్రైజ్మనీగా లభించింది.