ASIA CUP: ఒక్క స్థానం.. నలుగురి పోటీ

సెలెక్టర్లకు తలనొప్పిగా భారత జట్టు ఎంపిక... ఒక్కో స్థానానికి నలుగురు పోటీ... గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్న;

Update: 2025-08-19 07:00 GMT

ఆసి­యా కప్ 2025కు భారత జట్టు ఎం­పిక సె­లె­క్ట­ర్ల­కు పె­ద్ద తల­నొ­ప్పి­గా మా­రిం­ది. సీ­ని­య­ర్ ఆట­గా­ళ్లు, ఐపీ­ఎ­ల్ స్టా­ర్ల మధ్య తీ­వ్ర పోటీ నె­ల­కొం­ది. ఎవ­ర్ని ఎం­పిక చే­యా­లి? మరె­వ­ర్ని పక్క­న­పె­ట్టా­ల­నే వి­ష­యా­న్ని అజి­త్ అగా­ర్క­ర్ సా­ర­థ్యం­లో­ని సె­లె­క్ష­న్ కమి­టీ తే­ల్చు­కో­లే­క­పో­తుం­ది. ఒక్కో ప్లే­స్‌­కు ము­గ్గు­రు నుం­చి నలు­గు­రు ఆట­గా­ళ్లు పోటీ పడు­తు­న్నా­రు. ఇం­గ్లం­డ్ పర్య­ట­న­లో కె­ప్టె­న్‌­గా బ్యా­ట­ర్‌­గా దు­మ్ము­రే­పిన శు­భ్‌­మ­న్ గిల్.. గతే­డా­ది­గా టీ­మిం­డి­యా టీ20 జట్టు­లో లేడు. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­తో పాటు ఇం­గ్లం­డ్ గడ్డ­పై మె­రు­గైన ప్ర­ద­ర్శ­న­తో శు­భ్‌­మ­న్ గిల్ సూ­ప­ర్ ఫా­మ్‌­లో ఉన్నా­డు. అత­న్ని తీ­సు­కో­వా­లా? లేదా? అనే వి­ష­యం­పై అజి­త్ అగా­ర్క­ర్ సా­ర­థ్యం­లో­ని సె­లె­క్ష­న్ కమి­టీ మల్ల­గు­ల్లా­లు పడు­తోం­ది. అత­ని­తో పాటు యశ­స్వి జై­స్వా­ల్, సాయి సు­ద­ర్శ­న్‌ల వి­ష­యం­లో­నూ ఇదే పరి­స్థి­తి నె­ల­కొం­ది.

అయ్యర్‌, జురెల్‌కు చోటు

ఆసి­యా­క­ప్‌ భారత జట్టు­లో శ్రే­య­స్‌ అయ్య­ర్, జి­తే­శ్‌ శర్మ చోటు దక్కిం­చు­కు­నే అవ­కా­శం ఉంది. ఈ కప్‌­లో ఆడే జట్టు­ను అజి­త్‌ అగా­ర్క­ర్‌ సా­ర­థ్యం­లో­ని సె­ల­క్ష­న్‌ కమి­టీ మం­గ­ళ­వా­రం ఎం­పిక చే­య­నుం­ది. గతే­డా­ది జు­లై­లో కో­చ్‌­గా గౌ­త­మ్‌ గం­భీ­ర్‌ బా­ధ్య­త­లు చే­ప­ట్టిన తర్వాత శ్రే­య­స్, జి­తే­శ్‌ టీ20 జట్టు­లో­కి రా­లే­దు. డి­సెం­బ­ర్‌ 2023లో శ్రే­య­స్‌ చి­వ­రి­గా పొ­ట్టి ఫా­ర్మా­ట్లో కన­బ­డ­గా.. గతే­డా­ది జన­వ­రి­లో జి­తే­శ్‌ ఆఖ­రి­గా ఆడా­డు. ఈ సీ­జ­న్‌ ఐపీ­ఎ­ల్‌­లో రా­య­ల్‌ ఛా­లెం­జ­ర్స్‌ బెం­గ­ళూ­రు వి­జే­త­గా ని­ల­వ­డం­లో జి­తే­శ్‌ కీలక పా­త్ర పో­షిం­చా­డు. ఈ నే­ప­థ్యం­లో ధ్రు­వ్‌ జు­రె­ల్‌ స్థా­నం­లో అతడు జట్టు­లో­కి వచ్చే అవ­కా­శం ఉంది. ఇప్ప­టి­కే సంజు శాం­స­న్‌ రూ­పం­లో ప్ర­ధాన వి­కె­ట్‌­కీ­ప­ర్‌ టీ20 జట్టు­లో ఉన్నా­డు. పని భార ని­ర్వ­హ­ణ­లో భా­గం­గా ఇం­గ్లాం­డ్‌­తో అయి­దు టె­స్టుల సి­రీ­స్‌­లో మూడు టె­స్టు­లే ఆడిన పే­స­ర్‌ బు­మ్రా ఆసి­యా­క­ప్‌ జట్టు­కు సె­ల­క్ట­ర్లు ఎం­పిక చే­స్తా­రా లేదా అన్న­ది ఆస­క్తి­క­రం. మహ్మ­ద్‌ షమి గా­యం­తో అం­దు­బా­టు­లో లే­క­పో­వ­డం­తో ఒక పే­స­ర్‌ స్థా­నం ఖా­ళీ­గా­నే ఉంది.

నేడే జట్టు ప్రకటన..?

ముం­బై వే­ది­క­గా ఆసి­యా కప్ బరి­లో­కి దిగే భారత జట్టు­ను సె­లె­క్ష­న్ కమి­టీ­ని నేడు ప్ర­క­టిం­చే అవ­కా­శం ఉంది. 15 మంది ఆట­గా­ళ్ల­ను మా­త్ర­మే ఎం­పిక చే­యా­ల్సి ఉంది. అయి­తే తాజా సమా­చా­రం ప్ర­కా­రం 15వ ఆట­గా­డి ప్లే­స్ కోసం శ్రే­య­స్ అయ్య­ర్, రిం­కూ సిం­గ్, రి­యా­న్ పరా­గ్, వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ మధ్య తీ­వ్ర పోటీ ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో శ్రే­య­స్ అయ్య­ర్ మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­శా­డు. కె­ప్టె­న్‌­గా బ్యా­ట­ర్‌­గా సత్తా చాటి 11 ఏళ్ల తర్వాత పం­జా­బ్ కిం­గ్స్‌­ను ఫై­న­ల్‌­కు తీ­సు­కె­ళ్లా­డు. దాం­తో అయ్య­ర్‌­ను తీ­సు­కో­వా­ల­నే డి­మాం­డ్ వ్య­క్త­మ­వు­తోం­ది. అం­తే­కా­కుం­డా పా­కి­స్థా­న్‌­తో మ్యా­చ్‌­లో ఒత్తి­డి­ని తట్టు­కో­వా­లం­టే అను­భ­వం కలి­గిన ఆట­గా­ళ్లు జట్టు­లో ఉం­డా­ల­నే వాదన కూడా వి­ని­పి­స్తోం­ది. మరో­వై­పు రిం­కూ సిం­గ్ ఫి­ని­ష­ర్‌­గా జట్టు­లో కొ­న­సా­గు­తు­న్నా­డు. ఫిట్‌నెస్‌ను అంచనా వేసిన తర్వాతే బుమ్రాపై సెలక్టర్లు నిర్ణయం ప్రకటించొచ్చు. ఐపీఎల్‌-18లో సత్తా చాటిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా రేసులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అనూహ్యమైన ప్రదర్శన చేసిన శుభ్‌మన్‌ గిల్‌కు టీ20 జట్టులో స్థానం లభిస్తుందో లేదో స్పష్టత లేదు.

Tags:    

Similar News