బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. గాయపడిన హెడ్ కోలుకొని జట్టులో కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియా - భారత్ మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. మూడో టెస్టుతో పోలిస్తే ఆసీస్ మేనేజ్మెంట్ జట్టులో రెండు మార్పులు చేసింది. యువ ఆటగాడు 19 ఏళ్ల సామ్ కాన్ట్సాస్కు జట్టులో చోటు కల్పించింది. 3వ టెస్టు డ్రా కావడంతో ప్రస్తుతం సిరీస్ 1-1 సమంగా ఉంది. ఈ టెస్టులో గెలుపు WTC ఫైనల్ చేరేందుకు ఇరుజట్లకు కీలకం కానుంది.
ఆస్ట్రేలియా తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్ట్సాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్