శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడీ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఈ ప్లేయర్.. పంజాబ్ కింగ్స్ జట్టు ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్కి చేర్చాడు. ఫైనల్లోనూ తుదివరకూ పోరాడాడు. ఎన్నో అవమానాల తర్వాత తన సత్తా ఏంటో అయ్యర్ నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో అయ్యర్ బ్యాటింగ్ అద్భుతమనే చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వేర్వేరు జట్ల కు ప్రా తనిధ్యం వహించి ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు. 2020 సీజన్లో ఢిల్లీ, 2024 సీజన్లో కోల్క తా నైట్రై డర్స్ను టైటిల్ పోరుకు తీసుకెళ్లా డు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు.
సమ్థింగ్ స్పెషల్..
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథులుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్కు ట్రో ఫీల మీద ట్రో ఫీలు అందిస్తూ వచ్చాడు మాహీ. అటు రోహిత్ కూడా సారథిగా మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకున్నాడు. ఏకంగా ముంబైకి 5 టైటిల్స్ అందించాడు. అయితే వీళ్లు కేవలం ఒకే జట్టు తరఫున సారథిగా సక్సెస్ అయ్యారు. కానీ ఫైనల్లో మ్యాచ్ ఓడిపోయినా అతడి కెప్టెన్సీకి తిరుగులేదనే వాదనే వినిపిస్తోంది. ఇదే అదనుగా భారత టీ20 జట్టు సారథ్య పగ్గాలు అయ్యర్కు ఇవ్వాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది.
కోహ్లీకి ఆనందం.. శ్రేయస్కు నిరాశ
ఆర్సీబీ తరఫున ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఈ విజయం ఎంతో ప్రత్యేకం. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయిన ఆర్సీబీకి, కోహ్లీ నాయకత్వ పటిమ, అద్భుత ఆటతీరు ఈసారి ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఇది మూడో ఐపీఎల్ ఫైనల్ అయినప్పటికీ, మరోసారి నిరాశే ఎదురైంది. రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం తీవ్రంగా పోరాడిన ఈ మ్యాచ్, చివరికి ఆర్సీబీకి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. ఈ విజయంతో ఆర్సీబీ క్యాంప్లో సంబరాలు అంబరాన్నంటాయి. కానీ అయ్యర్ కెప్టెన్సీపై క్రికెట్ ప్రపంచంలో ప్రశంసల వర్షం కురుస్తోంది.