RCB : ఐపీఎల్ 2025 ఫైనల్లోకి బెంగళూరు ఎంట్రీ.. ఫ్యాన్స్ సంబరాలు

Update: 2025-05-30 09:15 GMT

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయంతో ఐపీఎల్ 2025 ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం ముల్లన్పూర్ వేదికగా జరిగిన క్వాలియన్-1 మ్యాచ్ లో టేబుల్ టాపర్ గా నిలిచిన పటిష్టమైన పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్లతో మట్టి కరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్బీబీ బౌలర్లు అసాధారణ బౌలింగ్ తో విజృంభించారు. వారి ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైపోయింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (26) టాప్ స్కోరర్ గా నిలవగా.. ప్రభమ్రన్ సింగ్ (18), ఓమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు.

బెంగళూరు బౌలర్లలో సుయాంష్ శర్మ (3/17), జోష్ హాజిల్ వుడ్ (3/21), య దయాల్ (2/26) పంజాబ్ పతనాన్ని శాసించారు. అనం తరం 102 పరుగల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్ల లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిల్ సాల్ట్ (56 నాటౌట్; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బెంగళూరు మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. కాగా, ఈ విజయంతో ఆర్సీబీ ఫైనల్ కు చేరుకోగా.. పంజాబ్ మాత్రం తమ ఆశలను చేజేతులా సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఫైనల్ చేరాలంటే జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో పోటీపడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News