Frank Duckworth Death: డక్వర్త్ కన్నుమూత
డీఎల్ఎస్ పద్ధతి సహ సృష్టికర్త మృతి;
వర్షం వస్తే క్రికెట్ మ్యా చ్ల ఫలితాలను నిర్దేశించే ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిని కనుగొన్న సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ కన్నుమూశారు. 84 ఏండ్ల డక్వర్త్ ఈనెల 21న మరణించినట్టు ఈఎస్పీఎన్ ఒక కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్కు చెందిన ఈ గణాంకవేత్త.. టోనీ లూయిస్తో కలిసి రూపొందించిన విధానాన్ని క్రికెట్లో 1997 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలుచేస్తోంది. ఆస్ట్రేలియా స్టాటిస్టిషియన్ స్టీవెన్ స్టెర్న్ సూచించిన పలు మార్పుల తర్వాత ఐసీసీ ఈ విధానాన్ని ‘డక్వర్త్ లూయి స్టెర్న్ – డీఎల్ఎస్)గా మార్చింది. టోనీ లూయిస్ 2020లోనే మరణించారు. 2010లో డక్వర్త్, లూయిస్కు ప్రతిష్టాత్మక మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (ఎంబీఈ) అవార్డు లభించింది.
మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో డీఎల్ఎస్ పద్దతి ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. టోనీ లూయిస్తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని ఫ్రాంక్ డక్వర్త్ రూపొందించారు. డీఎల్ఎస్ పద్ధతిని ఐసీసీ 1997లో తొలిసారిగా అమలు చేసింది. వర్షప్రభావిత మ్యాచ్ల్లో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో డీఎల్ఎస్ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. అయితే ఈ డీఎల్ఎస్ పద్ధతిలో ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్)గా నామకరణం చేశారు. లూయిస్ 2020లో కన్నుమూయగా.. తాజాగా ఫ్రాంక్ డక్వర్త్ తుదిశ్వాస విడిచారు.
2014లో ఫ్రాంక్ డక్వర్త్ క్రికెట్కు దూరమయ్యారు. 2014లో పదవీ విరమణ చేసే ముందువరకు ఐసీసీలో కన్సల్టెంట్ స్టాటిస్టిషియన్గా ఉన్నారు. అతను క్రీడకు చేసిన సేవలకు 2010లో ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ మెంబర్ ఆఫ్ గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాంక్ డక్వర్త్ మరణించినా.. అతడి పేరు మాత్రం క్రికెట్ చరిత్రలో మిగిలిపోనుంది.