TEST: రసవత్తరంగా ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్ట్
విజయానికి 10 వికెట్ల దూరంలో భారత్... 350 పరుగుల దూరంలో ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్లో పంత్, రాహుల్ సెంచరీలు;
ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో 90/2తో ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (6 పరుగులు) కలుపుకొని ఇంగ్లాండ్కు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసేసరికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 350పరుగులు అవసరం. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలే ఎక్కువ. బౌలర్లు సమష్టిగా రాణించడంపైనే టీమ్ ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. . తొలి ఇన్నింగ్స్లో భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
రాహుల్-పంత్ శతక మోత
ఈ టెస్టులో కెఎల్ రాహుల్ తొమ్మిదో టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ మరో ఎండ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తర్వాత రెండో ఇన్నింగ్స్లో పంత్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ గిల్ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 130 బంతుల్లో తన 8వ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ పంత్ శతకం చేశాడు. పంత్ ఒక టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఏ భారతీయ బ్యాటర్ సెంచరీ సాధించలేకపోయాడు. . అంతేకాదు ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో శతకం బాదిన రెండో వికెట్కీపర్గా నిలిచాడు. అంతకుముందు ఆండీ ప్లవర్ (జింబాబ్వే).. 2001లో సౌతాఫ్రికాపై (142, 199*) ఈ ఫీట్ సాధించాడు.
465 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
ఓవర్ నైట్ స్కోరు 209/3తో మూడో రోజు ఆటకు వచ్చిన ఇంగ్లండ్ తొలి సెషన్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా పెద్దగా ఇబ్బందిపడలేదు. రెండో రోజు శతకంతో మెరిసిన ఓలీ పోప్ (106)ను ప్రసిద్ధి.. మూడో రోజు రెండో ఓవర్లోనే ఔట్ చేసి ఆతిథ్య జట్టు - ను దెబ్బకొట్టాడు. ఆరో స్థానంలో వచ్చిన సారథి బెన్ స్టో- క్స్ (20).. బుమ్రాను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డాడు. డ్రింక్స్ విరామం తర్వాత సిరాజ్ వేసిన ఓవర్లో స్టోక్స్.. పంతు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మరో ఎం- డ్ బ్రూక్ మాత్రం ధాటిగా ఆడాడు. వ్యక్తిగత స్కోరు '0' వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. ప్రసిధ్ వేసిన తొలి ఓవర్లోనే 4, 6తో తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతడి దూకుడు అదే విధంగా కొనసాగింది. లంచ్ తర్వాత ప్రసిధ్.. స్మితను ఔట్ చేసి మరోసారి భారత్కు బ్రేకనిచ్చాడు. బౌండరీ వద్ద జడేజా, సుదర్శన్ సూపర్ క్యాచ్లో స్మి- త్ పెవిలియన్ చేరాడు. కానీ బ్రూక్ ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. ముఖ్యంగా సిరాజ్ను లక్ష్యంగా చేసు- కున్న అతడు.. రెండు ఓవర్ల వ్యవధిలో హైదరాబాదీ పేసర్ను 4, 4, 6, 4తో శిక్షించి సెంచరీకి సమీపించాడు. ప్రసిద్ బౌలింగ్ అతడు 99 పరుగుల వద్ద పుల్షాట్ ఆడబోయి లాంగ్ లెగ్ వద్ద శార్దూల్ చేతికి చిక్కడంతో అతడి గుండె పగిలింది.