GAMBHIR: భారత్కు తిరిగి రానున్న గౌతమ్ గంభీర్
ఇంగ్లండ్ నుంచి భారత్కు తిరిగి రానున్న గంభీర్.. కుటుంబంలో అత్యవసర పరిస్థితే కారణం;
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుంచి భారత్కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో అత్యవసర పరిస్థితే దీనికి కారణమని సమాచారం. భారత సీనియర్ జట్టు కంటే ముందే గంభీర్ ఇంగ్లండ్ చేరుకున్నాడు. శుక్రవారం ఇండియా ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడుతోంది. ఈ సమయంలోనే కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో గంభీర్ భారత్కు తిరిగి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లి జూన్ 11న గుండెపోటుకు గురికావడంతో, గంభీర్ జూన్ 12న హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. గంభీర్ తల్లి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి గంభీర్ తన తల్లి బాగోగులు చూసుకుంటున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతే తిరిగి ఇంగ్లండ్కు బయలుదేరే అవకాశం ఉంది. అయితే, జూన్ 20న ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్ నాటికి గంభీర్ జట్టుతో కలుస్తారని ఆశిస్తున్నారు. గంభీర్ ప్రయాణ తేదీ పూర్తిగా ఆయన తల్లి ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.