Jofra Archer : ఆర్చర్ మళ్లీ వచ్చాడు.. ఇంగ్లండ్ మరింత బలోపేతం

Update: 2025-06-28 06:45 GMT

అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ రెండో టెస్టు కోసం కూడా పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. జులై 2 నుంచి బర్మింగ్ హమ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లం డ్ విధ్వంసకర పేసర్ జోఫ్రా ఆర్చర్ చోటు సాధించాడు. 30 ఏళ్ల ఆర్చర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు 2021లో చివరిసారి టీమిం డియాపైనే ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మా ట్కు దూరంగా ఉంటున్నాడు. అయితే గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఆర్చర్కు ఇంగ్లండ్ టెస్ట్ స్క్వాడ్లో చోటు లభించింది. కాగా, ఈ ఒక్క మార్పు మినహా ఇంగ్లండ్ జట్టు ఇతర మార్పులేమి లేవు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆడిన జట్టే బర్మిం గామ్లో యధావిధిగా కొనసాగుతుందని ఈసీబీ వెల్లడించింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ పేసర్లు జోష్ టంగ్ 7, బెన్ స్టోక్స్ , బ్రైడన్ కార్స్ 4 వికెట్లతో విజృంభిం చారు. ఇప్పుడు వీరికి తోడుగా మరో ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా జట్టులోకి చేరడంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత పటిష్టంగా మారింది.

Tags:    

Similar News