గత ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియన్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కోచింగ్ బృందంలో మార్పులు చేస్తోంది. మొన్నటివరకు హెడ్ కోచ్గా ఉన్న మార్క్ బౌచర్ను తొలగించి తిరిగి మహేల జయవర్ధెనెకు ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రేను కోచింగ్ బృందంలోకి తీసుకుంది. ప్రస్తుతం బౌలింగ్ కోచ్గా ఉన్న లసిత్ మలింగతో కలిసి మంబ్రే పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముంబయి ఇండియన్స్ సామాజిక మాధ్యమాల్లో బుధవారం ప్రకటించింది. పరాస్ గతంలోనూ ముంబయి ఇండియన్స్ కోచింగ్ బృందంలో భాగంగా ఉన్నాడు. టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత జట్టుకు మంబ్రే బౌలింగ్ కోచ్గా పని చేశాడు