PRIYANK: రిటైర్మెంట్ ప్రకటించిన ప్రియాంక్
ప్రియాంక్ పంచాల్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్;
ఇండియా ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 8,856 పరుగులు సాధించిన ప్రియాంక్ మొత్తం 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రియాంక్ సారధ్యంలోని గుజరాత్.. రంజీ, సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలను గెలుచుకుంది. ప్రియాంక్కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఆ ఎడిషన్లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.