ఆర్సీబీని అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై ఫ్రాంచైజీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. తాము ఎలాంటి వాటాలు అమ్మడం లేదని కథనాలన్నీ అవాస్తవాలేనని వెల్లడించింది. ఇండియాలో పొగాకు,ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్పై నిషేధం ఉన్నప్పటికీ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఇతర మార్గాలున్నాయని తెలిపింది. ఆల్కహాల్ బ్రాండ్ల ప్రమోషన్కు ఆర్సీబీ అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదు.ఇప్పటికైతే ఆర్సీబీలో ఎలాంటి వాటాలు అమ్మడం లేదని ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ ఆరంభంలో ఆర్సీబీని కొనుగోలు చేసిన విజయ్ మాల్యా.. తర్వాత జరిగిన పరిణామాలతో ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు. దీంతో డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని నడిపిస్తోంది. ప్రతీ ఏడాది ఐపీఎల్ విలువ భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుత యజమానులకు ఇది ప్రతిష్టాత్మకమైన ఆస్తుల్లో ఒకటిగా మారిపోయింది.