చెన్నై కెప్టెన్ ధోనీ నిన్నటి LSG మ్యాచ్లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేశారు. ఐపీఎల్ లో 200డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్గా నిలిచారు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్గానూ ఘనత సాధించారు. మరోవైపు ఐపీఎల్ లో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ గెలిచిన 2వ ప్లేయర్గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) ఉన్నారు.
చెన్నై వరుస పరాజయాలకు(5) బ్రేక్ పడింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఛేదించింది. చివర్లో దూబే(43*), ధోనీ(26*) బౌండరీలతో మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. త్రిపాఠి, జడేజా నిరాశపరిచినా రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) రాణించారు. ఈ గెలుపుతో CSK ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.