REVANTH: మెస్సీతో పోరు.. రేవంత్ ముమ్మర ప్రాక్టీస్

మెస్సీతో తలపడేందుకు సిద్ధమవుతున్న సీఎం... డిసెంబర్ 13న హైదరాబాద్‌లో మెస్సీతో పోరు.. సర్కార్ బడుల జట్టుకు సీఎం ప్రాతినిథ్యం.. ప్రాక్టీస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్

Update: 2025-12-02 04:45 GMT

ఫు­ట్‌­బా­ల్ ది­గ్గ­జం, అర్జెం­టీ­నా స్టా­ర్ లి­యో­న­ల్ మె­స్సీ­‌­తో తల­ప­డేం­దు­కు తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి సి­ద్ద­మ­వు­తు­న్నా­రు. డి­సెం­బ­ర్ 13న హై­ద­రా­బా­ద్‌­లో­ని రా­జీ­వ్ గాం­ధీ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్టే­డి­యం­లో జర­గ­ను­న్న 7vs7 ఎగ్జి­బి­ష­న్‌ ఫ్రెం­డ్లీ మ్యా­చ్‌­లో మె­స్సీ­కి ప్ర­త్య­ర్థి­గా రే­వం­త్ రె­డ్డి ఫు­ట్‌­బా­ల్ ఆడ­ను­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఈ మ్యా­చ్‌­లో తె­లం­గాణ సర్కా­ర్ బడు­ల­కు చెం­దిన వి­ద్యా­ర్థుల జట్టు­కు సీఎం రే­వం­త్ రె­డ్డి సా­ర­థ్యం వహిం­చ­ను­న్నా­రు. ఈ మ్యా­చ్ కోసం సీఎం రే­వం­త్ రె­డ్డి ప్రా­క్టీ­స్ మొ­ద­లు పె­ట్టా­రు. ఇం­దు­కో­సం మర్రి చె­న్నా­రె­డ్డి మానవ వన­రుల కేం­ద్రం­లో­ని ఫు­ట్‌­బా­ల్ గ్రౌం­డ్‌­లో ఆయన ప్రా­క్టీ­స్ ప్రా­రం­భిం­చా­రు. సీ­ఎం­గా రో­జం­తా ఉన్న కా­ర్య­క్ర­మా­లు ము­గిం­చు­కు­ని ఆది­వా­రం రా­త్రి ఫుట్ బాల్ ఆట­గా­ళ్ల­తో కలసి మై­దా­నం­లో­కి ది­గా­రు.ప్రొ­ఫె­ష­న­ల్ ఫు­ట్‌­బా­ల్ ప్లే­య­ర్ల­తో కలి­సి‌ మ్యా­చ్ ఆడా­రు. సు­మా­రు గం­ట­పా­టు ప్రా­క్టీ­స్ చే­శా­రు. ఫు­ట్‌­బా­ల్ ది­గ్గ­జం లి­యో­న­ల్ మె­స్సీ వర్సె­స్ సీఎం రే­వం­త్ రె­డ్డి మ్యా­చ్‌­‌­పై సర్వ­త్రా ఆస­క్తి నె­ల­కొం­ది. ఈ మ్యా­చ్‌­కు సం­బం­ధిం­చిన టి­కె­ట్లు జొ­మా­టో డి­స్ట్రి­క్ట్ యా­ప్‌­లో శు­క్ర­వా­రం నుం­చి అం­దు­బా­టు­లో­కి వచ్చా­యి. ఈ మ్యా­చ్ టి­కె­ట్ల ధరలు రూ. 1700 నుం­చి మొ­ద­ల­వు­తా­యి. మె­స్సీ­తో కలి­సి టీ­మిం­డి­యా మాజీ కె­ప్టె­న్ వి­రా­ట్ కో­హ్లీ, కె­ప్టె­న్ శు­భ్‌­మ­న్ గిల్ కూడా హై­ద­రా­బా­ద్ రా­ను­న్న­ట్లు ఈవెం­ట్ ఆర్గ­నై­జ­ర్స్ ప్ర­క­టిం­చా­రు. మె­స్సీ­తో కలి­సి కో­హ్లీ, శు­భ్‌­మ­న్ గిల్ కూడా ఫ్రెం­డ్లీ ఎగ్జి­బి­ష­న్ మ్యా­చ్ ఆడ­ను­న్నా­ర­ని తె­లి­పా­రు. ది­గ్గజ ఆట­గా­ళ్ల­ను చూ­సేం­దు­కు ఇది మంచి అవ­కా­శా­మ­ని పే­ర్కొ­న్నా­రు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ సంకల్పానికి భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారత్‌లో స్టార్ పర్యటన

డి­సెం­బ­ర్ 13-15 వరకు మె­స్సీ భా­ర­త్‌­లో పర్య­టిం­చ­ను­న్నా­డు. డి­సెం­బ­ర్ 13 ఉదయం కో­ల్‌­క­తా ఈడె­న్ గా­ర్డె­న్స్‌­‌­కు వె­ళ్ల­ను­న్న మె­స్సీ.. అదే రోజు సా­యం­త్రం హై­ద­రా­బా­ద్‌­కు వస్తా­రు. డి­సెం­బ­ర్ 14 సా­యం­త్రం ముం­బై­లో­ని వాం­ఖ­డే స్టే­డి­యా­ని­కి వె­ళ్తా­రు. డి­సెం­బ­ర్ 15 మధ్యా­హ్నం ఒంటి గం­ట­కు ఢి­ల్లీ­లో­కి అరు­ణ్‌­జై­ట్లీ స్టే­డి­యా­న్ని సం­ద­ర్శి­స్తా­రు. ఇప్ప­టి­కే ఈ పర్య­ట­న­పై మె­స్సీ సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా ఓ పో­స్ట్ పె­ట్టా­డు. తె­లం­గాణ రై­జిం­గ్' కా­ర్య­క్ర­మా­ని­కి లి­యో­నె­ల్ మె­స్సీ­ని బ్రాం­డ్ అం­బా­సీ­డ­ర్‌­గా ని­య­మిం­చా­ల­నే యో­చ­న­లో తె­లం­గాణ ప్ర­భు­త్వం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ కా­ర్య­క్ర­మం ద్వా­రా క్రీ­డ­లు, పర్యా­ట­కం, పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హం, యువత భా­గ­స్వా­మ్యం వంటి వి­ష­యా­ల­ను ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా చా­టి­చె­ప్పా­ల­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. సీఎం రే­వం­త్ రె­డ్డి ఫు­ట్‌­బా­ల్ అత్యంత ఇష్ట­మైన క్రీడ. తాను చదు­వు­కు­నే రో­జు­ల్లో ఫు­ట్‌­బా­ల్ ఎక్కు­వ­గా ఆడే­వా­రు. మె­స్సీ రా­క­తో స్పో­ర్ట్స్ హబ్‌­‌­గా హై­ద­రా­బా­ద్‌­కు ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా గు­ర్తిం­పు లభి­స్తుం­ద­ని సీఎం భా­వి­స్తు­న్నా­రు. మెస్సీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News