Ind vs Ban : చెన్నై చేరుకున్న రోహిత్, కోహ్లీ.. 19నుంచి చెపాక్లో తొలి టెస్టు
రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు భారత్, బంగ్లాదేశ్ జట్లు సన్నదమవుతున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానుంది. ఇప్పటికే భారత జట్టు చెన్నైకి వెళ్లగా.. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చెన్నైచేరుకున్నారు.రోహిత్ ముంబై నుంచి చెన్నైచేరుకోగా, కోహ్లీ లండన్ నుంచి నేరుగా వచ్చాడు. వీరిద్దరూ చెన్నై ఎయిర్ పోర్ట్లో కన్పించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు తిరిగి మైదానంలో అడుగుపట్టబోతున్నారు.ఈ మ్యాచ్ కంటే ముందు చెపాక్లో ఏర్పాటు ఐదు రోజుల పాటు ప్రీట్రైనింగ్ క్యాంపులో భారత జట్టు పాల్గోనుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా భారత ఆటగాళ్లు చెన్నైకు చేరుకుంటున్నారు. టీ20 వరల్డ్కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా సైతం తొలి టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. ఇక, బంగ్లా క్రికెట్ జట్టు సైతం శనివారం భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది.