టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సూర్యకుమార్ గత కొద్ది కాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితమే అతడు సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్ నగరానికి వెళ్లాడు. ఇటీవల అక్కడి వైద్యులు సూర్యకుమార్కు ఆపరేషన్ చేశారు. అతడి సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించాడు. తన పొత్తికడుపు కుడివైపు ప్రాంతం లో హెర్నియా కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. త్వరలోనే మైదానంలోకి అడుగు పెట్టాలని ఉంది అని సూర్య తన పోస్టులో తెలిపాడు. కాగా, సూర్యకు ఇది రెండో హర్నియా సర్జరీ. 2024 లోనూ సూర్యకుమార్కు హెర్నియాకు శస్త్రచికిత్స జరి గింది. ఇక ఆగస్టు 26 నుంచి భారత్-బంగ్లా దేశ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. అప్పటి వరకు టీ20 కెప్టెన్ సూర్య పూర్తిగా కోలుకోవాలని అతడి అభి మానులు కోరుటుంటున్నారు. త్వరలోనే సూర్యకుమార్ యాదవ్ బెంగళూరు లోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం ప్రారంభిస్తాడని సమాచారం.