T20 WORLD CUP: పసికూనతో పోరుకు టీమిండియా సిద్ధం

నేడు భారత్-నమీబియా మ్యాచ్... ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా... మ్యాచులో సాధికార విజయంపై గురి

Update: 2026-02-12 03:15 GMT

టీ20 ప్ర­పం­చ­క­ప్ 2026 మరింత ఉత్కం­ఠ­భ­రి­తం­గా సా­గు­తోం­ది. డి­ఫెం­డిం­గ్ ఛాం­పి­య­న్ భారత జట్టు తొలి మ్యా­చ్‌­లో అమె­రి­కా­పై వి­జ­యం సా­ధిం­చి టో­ర్నీ­ని సా­ను­కూ­లం­గా ప్రా­రం­భిం­చిం­ది. ఇప్పు­డు రెం­డో మ్యా­చ్‌­లో నమీ­బి­యా­తో తల­ప­డేం­దు­కు సి­ద్ధ­మైం­ది. నేడు ఢి­ల్లీ­లో­ని అరు­ణ్ జై­ట్లీ స్టే­డి­యం­లో ఈ పోరు జర­గ­నుం­ది. తొలి మ్యా­చ్‌­లో వి­జ­యం సా­ధిం­చి­న­ప్ప­టి­కీ, ఆ గె­లు­పు భా­ర­త్‌­కు సు­ల­భం­గా రా­లే­దు. కీలక సమ­యం­లో టాప్ ఆర్డ­ర్ బ్యా­ట్స్‌­మె­న్ వరు­స­గా అవు­ట్ కా­వ­డం­తో జట్టు ఒత్తి­డి­లో పడిం­ది. అలాం­టి క్లి­ష్ట పరి­స్థి­తు­ల్లో కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ బా­ధ్యత తీ­సు­కు­ని అద్భుత ఇన్నిం­గ్స్ ఆడటం జట్టు­కు బలా­న్ని­చ్చిం­ది. అమె­రి­కా­తో జరి­గిన తొలి మ్యా­చ్‌­లో భా­ర­త్ 29 పరు­గుల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చిం­ది. ఒక దశలో 46 పరు­గు­ల­కే 4 వి­కె­ట్లు కో­ల్పో­యి కష్టా­ల్లో ఉన్న భారత జట్టు­ను సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ తన ధై­ర్య­వం­త­మైన బ్యా­టిం­గ్‌­తో గట్టె­క్కిం­చా­డు. కే­వ­లం 49 బం­తు­ల్లో 10 ఫో­ర్లు, 4 సి­క్స­ర్ల సా­యం­తో 84 పరు­గు­లు చేసి జట్టు­ను పో­రా­డే స్థి­తి­కి తీ­సు­కె­ళ్లా­డు. భా­ర­త్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 161/9 పరు­గు­లు చే­య­గా, అమె­రి­కా 132 పరు­గు­ల­కే పరి­మి­త­మైం­ది. ఈ వి­జ­యం­తో భా­ర­త్ గ్రూ­ప్ ఏలో రెం­డు పా­యిం­ట్లు, +1.450 నెట్ రన్‌­రే­ట్‌­తో అగ్ర­స్థా­నం­లో ని­లి­చిం­ది. పా­కి­స్థా­న్‌­కీ రెం­డు పా­యిం­ట్లు ఉన్న­ప్ప­టి­కీ నెట్ రన్‌­రే­ట్ తక్కు­వ­గా ఉం­డ­టం­తో రెం­డో స్థా­నం­లో కొ­న­సా­గు­తోం­ది. ఇప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ మరింత సమన్వయంతో ఆడాలని భావిస్తోంది. గత రికార్డులు భారత్‌కే అనుకూలంగా ఉన్నాయి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నమీబియాపై కూడా భారత్‌కే పైచేయి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడైనా ఫలితాలు మారే అవకాశం ఉండడంతో అప్రమత్తత అవసరమని మాజీలు హెచ్చరిస్తున్నారు.

తుది జట్టులో మార్పులు

ఈ మ్యా­చ్‌­లో భారత తుది జట్టు­లో కొ­న్ని మా­ర్పు­లు చో­టు­చే­సు­కు­నే అవ­కా­శ­ముం­ది. తొలి మ్యా­చ్‌­లో భారీ అం­చ­నాల మధ్య బరి­లో­కి ది­గిన ఓపె­న­ర్ అభి­షే­క్ శర్మ డకౌ­ట్‌­గా వె­ను­ది­రి­గి ని­రా­శ­ప­రి­చా­డు. ప్ర­స్తు­తం అతను వై­ర­ల్ ఫీ­వ­ర్‌­తో బా­ధ­ప­డు­తు­న్న­ట్లు కె­ప్టె­న్ సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ వె­ల్ల­డిం­చా­డు. ఆరో­గ్యం మె­రు­గు­ప­డు­తు­న్న­ప్ప­టి­కీ, నమీ­బి­యా­తో మ్యా­చ్‌­లో అత­ని­కి వి­శ్రాం­తి ఇచ్చే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. అతని స్థా­నం­లో వి­కె­ట్ కీ­ప­ర్ బ్యా­ట­ర్ సంజూ శాం­స­న్ తుది జట్టు­లో­కి రా­వ­చ్చ­ని సమా­చా­రం. ఇప్ప­టి­కే ఇషా­న్ కి­ష­న్, తి­ల­క్ వర్మ అమె­రి­కా­పై పె­ద్ద­గా రా­ణిం­చ­క­పో­వ­డం­తో, శాం­స­న్ రాక జట్టు­కు స్థి­ర­త్వా­న్ని అం­ది­స్తుం­ద­ని జట్టు మే­నే­జ్‌­మెం­ట్ భా­వి­స్తోం­ది. అలా­గే గాయం కా­ర­ణం­గా కొం­త­కా­లం­గా జట్టు­కు దూ­ర­మైన ఆల్‌­రౌం­డ­ర్ వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ తి­రి­గి జట్టు­లో చే­ర­ను­న్నా­డు. పూ­ర్తి­గా ఫి­ట్‌­నె­స్ సా­ధిం­చిన సుం­ద­ర్ ఢి­ల్లీ­లో జట్టు­తో కలు­స్తా­డ­ని కె­ప్టె­న్ స్ప­ష్టం చే­శా­డు. ఢి­ల్లీ పిచ్ స్పి­న్న­ర్ల­కు అను­కూ­లం­గా ఉండే అవ­కా­శం ఉన్నం­దున సుం­ద­ర్ ఎం­పిక కీ­ల­కం­గా మా­ర­నుం­ది. అతను జట్టు­లో­కి వస్తే ఆల్‌­రౌం­డ­ర్ శి­వ­మ్ దూబే స్థా­నం­పై ప్ర­భా­వం పడే అవ­కా­శం ఉంది. భా­ర­త్–నమీ­బి­యా మ్యా­చ్‌­ను భా­ర­త్‌­లో జియో హా­ట్‌­స్టా­ర్ యాప్, వె­బ్‌­సై­ట్‌­ల­లో లైవ్ స్ట్రీ­మిం­గ్‌­గా వీ­క్షిం­చ­వ­చ్చు. అలా­గే స్టా­ర్ స్పో­ర్ట్స్ నె­ట్‌­వ­ర్క్ చా­న­ళ్ల­లో ప్ర­త్య­క్ష ప్ర­సా­రం ఉం­టుం­ది. పా­యిం­ట్ల పట్టి­క­లో అగ్ర­స్థా­నం­లో ని­ల­వా­లం­టే ఈ మ్యా­చ్ కీ­ల­కం.

Tags:    

Similar News