TEAM INDIA: భీమవరం వాసికి అరుదైన గుర్తింపు
టీమిండియా మేనేజర్గా పీవీఆర్ ప్రశాంత్... భీమవరం ఎమ్మెల్యే కుమారుడే ప్రశాంత్;
భారత క్రికెట్ జట్టులో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు, భీమవరానికి చెందిన పీవీఆర్ ప్రశాంత్ను టీమిండియా మేనేజర్గా నియమించారు. త్వరలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్కు ఆయన భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రశాంత్, గతంలో పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ఆటగాడిగా ప్రాతినిధ్యం వహించారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్తో పాటు హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ఈ కీలక టోర్నమెంట్లో జట్టు మేనేజ్మెంట్ బాధ్యతలను ప్రశాంత్ పర్యవేక్షించనున్నారు. ప్రశాంత్ రాజకీయంగా కూడా సుపరిచితమైన కుటుంబానికి చెందినవారు. ఆయన భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు కుమారుడు. అంతేకాకుండా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు స్వయానా అల్లుడు.
1997 తర్వాత ఇదే
భారత క్రికెట్ జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 1997లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా విశాఖపట్నం మాజీ మేయర్ డీవీ సుబ్బారావు టీమిండియాకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా సేవలు అందించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రశాంత్కు ఈ అవకాశం దక్కడం విశేషం. గతంలో 1983లో వరల్డ్ కప్ విజయం సాధించిన సమయంలో టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉండటం విశేషం. టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉన్నారు. అతడి పేరు పి.ఆర్.మాన్ సింగ్. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్ గా వ్యవహరించారు. పీ.ఆర్. మాన్ సింగ్ 1938 నవంబర్ 24న జన్మించారు. అతను ఒక మాజీ క్రికెటర్. 1987 క్రికెట్ ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్కు చేరుకున్న భారత జట్టును కూడా నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘానికి కార్యదర్శిగా కూడా పనిచేశారు. తెలుగు వ్యక్తులు టీమిండియా మేనేజర్లుగా వ్యవహరిస్తే.. టీమిండియా విజయం సాధిస్తుందనే ఓ సెంటిమెంట్ కూడా ఉందని సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం విశేషం. మరోవైపు 1997 వెస్టిండీస్ పర్యటనలోో భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా డీవీ సుబ్బారావు వ్యవహరించారు. దాదాపు 28 సంవత్సరాల తరువాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అవకాశం దక్కడం విశేషం.
సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్
యూఏఈలో సెప్టెంబర్ 09న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనుంది. అప్గానిస్తాన్, హాంకాంగ్ పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఎంపికయ్యారు. మరోవైపు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ బాధ్యతలను పంచుకోబోతున్నారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.